టీటీడీ పాలక మండలికి సుధామూర్తి రాజీనామా

  • గత ఏడాది మే నెలలో టీటీడీ బోర్డు మెంబర్ గా నియామకం
  • పదవికి రాజీనామా చేస్తూ ఓ లేఖ రాసిన సుధామూర్తి
  • రాజీనామాకు గల కారణాలు ప్రస్తావించని వైనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యులు పొట్లూరి రమేశ్ బాబు, చల్లా రామచంద్రారెడ్డి ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా, టీటీడీ పాలక మండలి సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీకి ఆమె ఓ లేఖ రాశారు. తన రాజీనామాకు గల కారణాలను ఆమె వెల్లడించలేదు. గత ఏడాది మే నెలలో టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఆమె రెండోసారి నియమితులయ్యారు.
Go Back to Shorts
TTD
Infosys
chair person
sudha murthy

More Telugu News