Odisha: ఒడిశాలో అధికారితో గుంజీలు తీయించిన బీజేడీ ఎమ్మెల్యే!

  • పాట్నాగఢ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సరోజ్ కుమార్
  • రోడ్లలో నాణ్యత లేదంటూ జూనియర్ ఇంజనీర్ పై ఫైర్
  • ఆ అధికారితో గుంజీలు తీయించి హెచ్చరించిన వైనం

ఒడిశాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత సరోజ్ కుమార్ మెహెర్ వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. పాట్నాగఢ్ నియోజకవర్గానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తన నియోజకవర్గ పర్యటన సందర్భంగా పలు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల నాణ్యతలేని రోడ్లను ఆయన గుర్తించారు. రోడ్లలో నాణ్యత లేదంటూ సంబంధిత జూనియర్ ఇంజనీర్ పై సరోజ్ కుమార్ మండిపడటమే కాకుండా, ఆ ఇంజనీర్ తో గుంజీలు తీయించి, ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. తాను చెప్పినట్టు నడచుకోకపోతే హింసకు కూడా వెనుకాడనని ఆ ఇంజనీర్ ను సరోజ్ కుమార్ బెదిరించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చేరి వైరల్ గా మారింది. 

More Telugu News