Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి!

  • జగన్ అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు
  • మొదటి దరఖాస్తును మాత్రం పేద మాజీ ఆంధ్రా సీఎం చేసుకున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి

ఉండవల్లిలోని ప్రజావేదికను తన నివాసానికి అనుబంధంగా కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ ను కోరిన సంగతి తెలిసిందే. పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకోవడానికి వీలుగా ఈ కేటాయింపు జరపాలని లేఖలో కోరారు.

తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు సొంతిల్లు కట్టిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటి కోసం ఓ పేద మాజీ ఆంధ్రా సీఎం మొదటి దరఖాస్తును చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News