Jagan: అసలు హంతకులను పట్టుకోండి: వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులకు జగన్ ఆదేశాలు

  • అసెంబ్లీ ఎన్నికలకు ముందు దారుణ హత్య
  • ప్రస్తుతం జైల్లో వివేకా పీఏ కృష్ణారెడ్డి
  • బుధవారం నాడు సోదరుడిని కలిసిన సునీత

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అసలు హంతకులను పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పులివెందులలోని తన నివాసంలో అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు వివేకా దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం వివేకా పీఏ కృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరుడు దొండవాగు శంకర్, పనిమనిషి కుమారుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా వున్నారు. కాగా, నిన్న వివేకా కుమార్తె సునీత సైతం తన సోదరుడు జగన్ ను కలిసి, ఈ కేసులో అసలు హంతకులను బయట పెట్టాలని కోరిన సంగతి తెలిసిందే.

More Telugu News