vishvaksen: నైజామ్ లో దుమ్మురేపేస్తోన్న 'ఫలక్ నుమా దాస్'

  • విష్వక్సేన్ హీరోగా 'ఫలక్ నుమా దాస్'
  • మాస్ ఆడియన్స్ నుంచి ఆదరణ
  •  మాస్ హీరోగా మరింత క్రేజ్   

విష్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన 'ఫలక్ నుమా దాస్' .. క్రితం నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి, నైజామ్ లో మంచి ఆదరణ లభిస్తోంది.

నైజామ్ లో 4 రోజులకుగాను ఈ సినిమా 1.89 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ ప్రాంతంలో ఈ సినిమా 3 కోట్ల షేర్ వరకూ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. విష్వక్సేన్ దర్శకత్వంలోనే రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన హర్షిత .. సలోని మిశ్రా కథానాయికలుగా నటించారు. లాభాల సంగతి అటుంచితే, ఈ సినిమా విష్వక్సేన్ కి కథానాయకుడిగా మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టిందని అంటున్నారు

More Telugu News