BJP: ఎంఐఎంతో చేతులు కలిపినందుకు తగిన శాస్తే జరిగింది: టీఆర్ఎస్‌పై లక్ష్మణ్ ఫైర్

  • నిజామాబాద్‌లో బీజేపీ విజయోత్సవ సభ
  • బీజేపీ విజయం వెనక 30 ఏళ్ల కష్టం ఉందన్న లక్ష్మణ్
  • టీఆర్ఎస్‌కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్న బీజేపీ చీఫ్

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అధికార టీఆర్ఎస్‌కు షాకిచ్చింది. ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో సోమవారం నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతలు విజయోత్సవ సభ నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆ పార్టీ తెలంగాణ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్, యెండల లక్ష్మీనారాయణ తదితరులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం వెనక 30 ఏళ్ల కృషి, త్యాగం ఉన్నాయన్నారు. నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. పసుపు, ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేశారని విమర్శించారు. ఎంఐఎంతో చేతులు కలిపినందుకు టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన శాస్తి చేశారని, కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు.

More Telugu News