Chandrababu: అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు: పార్టీ నేతలతో చంద్రబాబు

  • కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండాలి
  • టీడీపీకి ఆటుపోట్లు కొత్తేమీ కాదు
  • సమన్వయంతో ముందుకు సాగాలి

అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదని, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు. నేడు తెలంగాణకు చెందిన ఆ పార్టీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలపై చర్చించారు. ఏపీలో టీడీపీ ఓటమికి గల కారణాలతో పాటు, తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. టీడీపీకి ఆటుపోట్లు కొత్తేమీ కాదన్న చంద్రబాబు, సమన్వయంతో ముందుకు సాగాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

More Telugu News