Murali Mohan: ఆసుపత్రిలో మురళీమోహన్ ను పరామర్శించిన టీఆర్ఎస్ నేతలు

  • కేర్ ఆసుపత్రికి వచ్చిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి
  • మురళీమోహన్ కు పరామర్శ
  • త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష

టీడీపీ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తాజాగా, తెలంగాణ కార్మిక శాఖ  మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో మురళీమోహన్ చికిత్స పొందుతున్న కేర్ ఆసుపత్రికి వచ్చారు. వారిని చూడగానే మురళీమోహన్ బెడ్ పై నుంచి వీల్ చెయిర్ లో కూర్చున్నారు. ఆ తెలంగాణ నేతలు ఇద్దరూ మురళీమోహన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

ఈ విషయాన్ని మురళీమోహన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల ఎన్నికల్లో పోటీచేయకుండా తన కోడలిని రంగంలోకి దింపిన మురళీమోహన్, తల్లి అస్థికలు గంగలో నిమజ్జనం చేసేందుకు అలహాబాద్ వెళ్లి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు కాళ్లు బిగుసుకుపోయి నడవలేని స్థితిలో హైదారబాద్ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన వెన్నుపూసలో పలు చోట్ల సమస్యలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

More Telugu News