Ranga Reddy District: పులి బారి నుంచి కాపాడమంటున్న ప్రజలు!

  • మైసగండి ప్రాంతంలో పులి సంచారం
  • ఆవు, మూడు దూడలపై దాడి
  • అటవీ శాఖ స్పందించాలంటున్న గ్రామస్థులు

రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలం మైసగండి ప్రాంతంలో ఓ పులి సంచరిస్తుండటం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది. వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన పులి, అక్కడ నివసించేవారి పశు సంపదపై దాడులకు దిగుతోంది. ఇప్పటికే ఓ ఆవును, మూడు దూడలపై దాడి చేసి, వాటిని చంపింది. పులి తిరుగుతూ ఉండటంపై ఆందోళన చెందుతున్న మైసగండి వాసులు, వెంటనే అటవీ శాఖాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇది మనుషులపై దాడి చేయకముందే దాని బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

  • Loading...

More Telugu News