jagan: పుదుచ్చేరి మంత్రికి జగన్ ఫోన్,, హాజరవుతానన్న మల్లాడి!

  • మల్లాడి కృష్ణారావుకు స్వయంగా ఫోన్ చేసిన జగన్
  • ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైసీపీ అధినేత
  • హాజరవుతానని చెప్పిన మల్లాడి

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురికి జగన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నారు. తాజాగా పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావుకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మల్లాడి స్వయంగా వెల్లడించారు. తనకు జగన్ ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ప్రమాణస్వీకారానికి వెళ్తున్నానని చెప్పారు. జూన్ 10లోగా జగన్ తో మరోసారి భేటీ అవుతానని... యానాంకు సంబంధించిన సరిహద్దు సమస్యను ఆయనకు వివరిస్తానని తెలిపారు.  

More Telugu News