sakshi channel: ‘సాక్షి’ ఛానెల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా: సీఎం రమేశ్

  • టీడీపీ ఓటమికి నేతలే కారణమని లోకేశ్ అనలేదు
  • సాక్షి ఛానెల్ లో వచ్చిన ఈ వార్తను ఖండిస్తున్నా
  • ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదు

ఏపీలో టీడీపీ ఓటమికి నేతలు, నాయకులే కారణమని నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారంటూ సాక్షి ఛానెల్ లో వచ్చిన వార్తను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా, సీఎం రమేశ్ కూడా దీనిపై స్పందిస్తూ, నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న ఆ వార్తను తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాక్షి ఛానెల్ పై ఆయన మండిపడ్డారు. నిరంతర, నిత్య అసత్య వార్తా ప్రసారిణి ‘సాక్షి’ అని, ఆ ఛానెల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రమేశ్ ఓ ట్వీట్ చేశారు. 

More Telugu News