Vijayawada: రోడ్డు ప్రమాదంలో వంతెనకు వేళ్లాడిన కారు.. సినిమా సెట్టింగ్ అనుకుని సెల్ఫీలు దిగిన జనం!

  • విజయవాడ రామవరప్పాడులో ఘటన
  • పోలీసుల రాకతో అసలు విషయం వెల్లడి
  • కారులో ఉన్న ప్రయాణికులు క్షేమం

సెల్ఫీ సంస్కృతి పెచ్చరిల్లిన తర్వాత జనాల్లో ప్రతి సంఘటనకు ఓ సెల్ఫీ దిగడం అలవాటుగా మారిపోయింది. తాజాగా, విజయవాడ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా, విషయం తెలియని జనం మాత్రం సెల్ఫీలు దిగేందుకు పోటీలుపడ్డారు.

అసలు విషయం ఏమిటంటే, ఓ కారు రింగ్ రోడ్డుపై వేగంగా ప్రయాణిస్తూ అదుపుతప్పింది. అయితే వంతెనపై రోడ్డుకు పక్కగా నిర్మించిన గోడపైకి ఎక్కి నిలిచిపోయింది. చూపరులకు ఆ కారు వంతెన పైనుంచి వేళ్లాడుతున్నట్టుగా కనిపించింది. ఇది చూసిన జనాలు, ఆ కారును ఏదో సినిమా షూటింగ్ కోసం వేళ్లాడదీసినట్టుగా భావించి సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. కాగా, కారులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. 

More Telugu News