kantharao: మా నాన్నగారు వున్నప్పుడే మాకు ఎవరూ సాయం చేయలేదు .. ఇప్పుడెవరు చేస్తారు?: కాంతారావు కుమారుడు రాజా

  • మా నాన్న కల అదే 
  • ఆయన కేన్సర్ తో బాధ పడ్డారు
  •  డబ్బంతా ట్రీట్మెంట్ కోసం అయిపోయింది   

తాజా ఇంటర్వ్యూలో కాంతారావు తనయుడు రాజా మాట్లాడుతూ, ఇండస్ట్రీ నుంచి తమకి ఎలాంటి సాయం అందకపోవడం గురించి ప్రస్తావించారు. "హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలనేది మా నాన్న కల. ఆ విషయం తెలిసి సుబ్బిరామిరెడ్డిగారు 5 లక్షలు ఇచ్చారు. అదే సమయంలో నాన్నకి కేన్సర్ రావడంతో ట్రీట్మెంట్ కోసం ఆ డబ్బును ఖర్చు చేసేశాము.

ఆ సమయంలో 'మా' అధ్యక్షుడిగా మురళీమోహన్ గారు వున్నారు. 'మా' తరఫున ఒక 10 లక్షలు పోగుచేసి మాకు ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా మురళీమోహన్ గారు చెప్పారు. ఆ తరువాత 'ఎవరూ ఇవ్వడం లేదు .. నేనేం చేయలేను' అన్నారు. మా నాన్నగారు వున్నప్పుడే మాకు ఎవరూ సాయం చేయలేదు .. ఇప్పుడెవరు చేస్తారు? అనుకున్నాను. విధి అంతే .. ఈ విషయంలో ఎవరినీ ఏమీ అనడానికి లేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News