KCR: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్!

  • నిన్నటి నుంచి తిరుపతి పర్యటనలో కేసీఆర్
  • నేడు తుమ్మలగుంటకు వెళ్లిన కేసీఆర్
  • చెవిరెడ్డి ఇంటికి అతిథిగా రాక

నిన్నటి నుంచి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నేడు అనూహ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి అతిథిగా వెళ్లారు. ఈ ఉదయం తిరుమలలో స్వామి దర్శనానంతరం కొండదిగివచ్చిన కేసీఆర్ ఫ్యామిలీ, తిరుచానూరు వెళ్లి శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

ఆ తరువాత తుమ్మలగుంటలోని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇంటి వైపు ఆయన కాన్వాయ్ దారితీసింది. చెవిరెడ్డి ఇంటికి కేసీఆర్ చేరుకోగా, ఆయనకు చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. వారింట కొద్దిసేపు గడిపిన కేసీఆర్, చెవిరెడ్డితో మాట్లాడిన తరువాత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. మధ్యాహ్నం తరువాత రేణిగుంటకు చేరుకుని, ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు కేసీఆర్ బయలుదేరనున్నారు.

More Telugu News