వైసీపీ శాసన సభాపక్షం సమావేశం ఎఫెక్ట్.. జగన్ క్యాంపు కార్యాలయం వద్ద నిలిచిన ట్రాఫిక్
- కిలోమీటరు మేర నిలిచిపోయిన వాహనాలు
- అక్కడే దిగి నడిచి వెళ్లిన ప్రజాప్రతినిధులు
- ఒకేసారి రావడంతో ట్రాఫిక్ రద్దీ
కిలోమీటరు మేర వాహనాలు నిలిచి పోవడంతో సమావేశానికి ఆలస్యం అవుతుందన్న కారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడే వాహనాలు దిగిపోయి నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం 10.31 గంటలకు ఎమ్మెల్యేలతోను, 11.30 గంటలకు ఎంపీలతోను జగన్ సమావేశమైన విషయం తెలిసిందే.