Vijayawada: పొట్లూరి వరప్రసాద్ రాజకీయ ఆశలకు గండికొట్టిన కేశినేని నాని... విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీ వశం

  • సిట్టింగ్ స్థానాన్ని నిలటెట్టుకున్న టీడీపీ నేత
  • పట్టుదలతో రంగంలోకి దిగిన పొట్లూరి
  • పైచేయి నిరూపించుకున్న నాని

తెలుగుదేశం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో  విజయవాడ స్థానాన్ని నిలబెట్టుకుంది. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై విజయం సాధించారు. సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ ఇటీవలే మహర్షి చిత్రంతో మాంచి ఊపుమీదున్నారు. గతకొంతకాలంగా రాజకీయరంగంపై కన్నేసిన ఆయన ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో వైసీపీ టికెట్ అందుకున్నారు. కానీ, విజయవాడలో ఎంతో పట్టు ఉన్న కేశినేని ముందు నిలవలేకపోయారు.

More Telugu News