Andhra Pradesh: ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది: బొత్స సత్యనారాయణ

  • జగన్ గెలుపు ఓ సునామీ 
  • ప్రజలకు జగన్ పై ఉన్న నమ్మకం వల్లే ఇంతటి విజయం
  • జగన్ నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యం

ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బొత్స మీడియాతో మాట్లాడుతూ, జగన్ గెలుపును ఓ సునామీగా అభివర్ణించారు. ప్రజలకు జగన్ పై ఉన్న నమ్మకం వల్లే ఇంతటి భారీ విజయం తమకు లభించిందని అన్నారు. జగన్ నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పిన బొత్స, టీడీపీ పాలనకు భిన్నంగా తమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై బొత్స విమర్శలు గుప్పించారు.

More Telugu News