Srikakulam: శ్రీకాకుళంలో మళ్లీ లీడ్ లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు

  • టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు
  • వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ
  • 2 వేల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానంలో విజయం దోబూచులాడుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. ఆ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థిగా కింజారపు రామ్మోహన్‌నాయుడు పోటీ చేశారు. ఇప్పటి వరకూ శ్రీకాకుళం స్థానం వైసీపీదే అనిపించినప్పటికీ అనూహ్యంగా రామ్మోహన్ నాయుడు పుంజుకున్నారు. ప్రస్తుతం 2 వేల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు.

More Telugu News