soyam baburao: బీజేపీ ఖాతాలోకి మరో విజయం .. ఆదిలాబాద్ నుంచి సోయం బాబూరావు గెలుపు

  • బీజేపీకి తొలి విజయాన్ని అందించిన కరీంనగర్ 
  • రెండో  విజయాన్ని అందించిన ఆదిలాబాద్
  •  తెలంగాణలో బలపడుతోన్న బీజేపీ  

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకి గాను మొదటి నుంచి 4 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటూ వచ్చింది. ఈ నాలుగు స్థానాల్లో కరీంనగర్ తొలి విజయాన్ని ఖరారు చేసుకుంది. మిగతా 3 స్థానాల్లో మరో స్థానం కూడా బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాబూరావు .. టీఆర్ఎస్ అభ్యర్థి జి.నగేశ్ పై విజయం సాధించారు. దీనిని బట్టి చూస్తుంటే, తెలంగాణలో బీజేపీ బలపడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

More Telugu News