Andhra Pradesh: ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం.. స్వరూపానంద స్వామితో ఫోన్ లో మాట్లాడిన జగన్!

  • ఏపీలో వైసీపీ ప్రభంజనం 
  • 150 స్థానాల్లో లీడ్ లో దూసుకుపోతున్న వైసీపీ
  • ఎల్లుండి వైసీపీ శాసనసభాపక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో 150 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో ఫోన్ లో మాట్లాడారు. ఆయన సూచన మేరకు ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్లుండి (మే 25న) వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

More Telugu News