jayam ravi: నిధి అగర్వాల్ మంచి చాన్స్ పట్టేసింది

  • తెలుగులో పలకరించని సక్సెస్ 
  • షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
  • తమిళంలో జయం రవి జోడీగా ఛాన్స్

తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. 'సవ్యసాచి' .. 'మిస్టర్ మజ్ను' సినిమాలతో ఈ సుందరి కుర్రాళ్ల మనసులను దోచేసింది. నాజూకు భామగా వాళ్లతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ రెండు సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఆశించిన స్థాయిలో ఆమె కెరియర్ ఊపందుకోలేదు.

ఈ రెండు సినిమాల తరువాత ఆమె ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో మాత్రమే అవకాశాన్ని అందుకోగలిగింది. చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి తమిళంలో ఒక ఛాన్స్ దక్కించుకుంది. తమిళంలో జయం రవి హీరోగా 'బోగన్' ఫేమ్ లక్ష్మణ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కి అవకాశం దక్కింది. హోమ్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Telugu News