Road Accident: ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన వోల్వో బస్సు.. పది మందికి గాయాలు

  • తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌, మరో ప్రయాణికుడు
  • తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద ఘటన
  • క్షతగాత్రులు రుయా ఆసుపత్రికి తరలింపు
ఆగి ఉన్న లారీని, వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

 నాయుడు పేట నుంచి బెంగళూరుకు గాజు గ్లాసు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్‌ సి.మల్లవరం వద్ద రోడ్డుపక్కన నిలిపాడు. అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న ఓ వోల్వో బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలోకి చాలా వరకు లారీ వెనుక భాగం చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో పది మంది గాయపడగా వీరిలో డ్రైవర్‌, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని  క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
Road Accident
volvo bus lorry clash
ten injured
Tirupati

More Telugu News