Narayanapet: చేతి గడియారం వాడుతూ కాపీయింగ్... డిగ్రీ విద్యార్థి డిబార్!

  • నారాయణపేటలో ఘటన
  • స్మార్ట్ వాచ్ లో జవాబులు తెచ్చిన విద్యార్థి
  • కనిపెట్టి చర్యలు తీసుకున్న అధికారులు

చేతికి ఓ స్మార్ట్ వాచ్ ని తీసుకువచ్చి, దాని సాయంతో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న ఓ డిగ్రీ విద్యార్థిని అధికారులు డిబార్ చేశారు. ఈ ఘటన నారాయణపేటలో జరిగింది. ఇక్కడి స్ఫూర్తి ప్రైవేటు డిగ్రీ కాలేజీలో నిన్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష జరుగుతూ ఉండగా, ఓ విద్యార్థి, ముందుగానే కొన్ని జవాబులను ఫోటో తీసి వాచిలో స్టోర్ చేసి తెచ్చుకున్నాడు. తాను ఫోటోలు తీసిన జవాబులకు సంబంధించిన ప్రశ్నలు రాగా, చూసి రాయడం ప్రారంభించాడు. అతని వాలకంపై అనుమానంతో పరిశీలించిన అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ స్మార్ట్ వాచ్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు, అతన్ని డిబార్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News