meghamsh: తెరపైకి హీరోగా శ్రీహరి తనయుడు మేఘాంశ్

  • శ్రీహరి పెద్ద కుమారుడు మేఘాంశ్ 
  • మేఘాంశ్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 
  • టైటిల్ గా 'రాజ్ దూత్' 

తెలుగు తెరపై తెలంగాణ యాసతో సందడి చేసిన హీరో శ్రీహరి. విలన్ గా .. హీరోగా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చారు. ఏ పాత్రను పోషించినా ఆయన తనదైన ముద్రను చూపించారు. అలాంటి శ్రీహరి లేని లోటు ఇప్పటికీ కనిపిస్తూనే వుంది. శ్రీహరి - శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడైన మేఘాంశ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా 'రాజ్ దూత్' అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కార్తీక్ - అర్జున్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకూ పూర్తయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. శ్రీహరి మాదిరిగానే ఆయన తనయుడు మేఘాంశ్ కూడా మాస్ హీరోగా మార్కులు కొట్టేస్తాడేమో చూడాలి.

More Telugu News