Andhra Pradesh: గంటా శ్రీనివాస్ ఓటమిపాలు కాబోతున్నారు: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

  • ఏపీలో 3 స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ నిచ్చింది
  • ఆ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి
  • ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే డబ్బు ఖర్చు చేయలేదు

విశాఖ నార్త్ లో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఓడిపోబోతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ నిచ్చిందని అన్నారు. ఆ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు మాత్రమే డబ్బు ఖర్చు చేయలేదని, టీడీపీ, వైసీపీలు డబ్బులు కుమ్మరించాయని ఆరోపించారు. కాగా, విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

More Telugu News