Andhra Pradesh: ‘చంద్రగిరి’ ఎన్నికల్లో అక్రమాలు.. అధికారులపై కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం!

  • ఐదు పోలింగ్ కేంద్రాల పీవో, ఏపీవోల సస్పెన్షన్ 
  • వీరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం
  • అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ పెట్టాలన్న ఈసీ
చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో గత నెల 11న ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆఫీసర్లు(పీవో), ఏపీవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అలాగే ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. చంద్రగిరిలోని ఈ ఐదు గ్రామాల్లో ఎన్నికల  సందర్భంగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిన్న ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ నిర్వహించింది. ఈసీ విచారణలో ఇక్కడ పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో చర్యలు తీసుకుంది.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
ec
EC
SUSPEND
FIVE POLLING BOOTHS

More Telugu News