ఎవరి పక్షాన ఉండేది 23 తర్వాతే నిర్ణయిస్తాం: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

  • మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి
  • ఇప్పుడే యూపీఏ పక్ష పార్టీల సమావేశంతో ప్రయోజనం లేదు
  • యూపీఏ పక్ష పార్టీల్లో స్టాలిన్ వ్యాఖ్యలపై చర్చ
కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని నిన్నటి ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఏ పక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ కూటమిలో చేరే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే తాము నిర్ణయిస్తామని తెలిపారు. మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని, ఇప్పుడే, ఢిల్లీలో యూపీఏ పక్ష పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీఏ పక్ష పార్టీల్లో చర్చనీయాంశమైనట్టు సమాచారం. కాగా, బీజేపీ వ్యతిరేక పక్షాలు మాత్రం వరుస భేటీలు జరుపుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  
Go Back to Shorts
dmk
stalin
upa
nda

More Telugu News