వివక్ష చూపించాల్సిన పని లేదు.. ఎవరు కలసి వచ్చినా పని చేస్తాం: చంద్రబాబు
- ఫలితాల రోజే కూటమి సమావేశం
- చంద్రబాబుకు మీడియా ఆసక్తికర ప్రశ్న
- ఊహాజనిత ప్రశ్నలు వద్దన్న చంద్రబాబు
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను కూటమితో టీఆర్ఎస్ కలిసి వచ్చినా పని చేస్తారా? అని ప్రశ్నించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తామని, ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు.