Andhra Pradesh: కొత్త జంటను ఆశీర్వదించిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

  • ఘనంగా టీడీపీ నేత మువ్వా కుమార్తె  వివాహం
  • నారా లోకేశ్ తో పాటు హాజరైన పలువురు నేతలు
  • వధూవరులకు బహుమతులు అందజేసిన లోకేశ్

టీడీపీ నేత శ్రీ మువ్వా ప్రసాదరావు కుమార్తె మంజుల వివాహం నిన్న రాత్రి గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులకు బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని నారా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.

More Telugu News