punjab: పంజాబ్‌లో కాంగ్రెస్ ఓడితే రాజీనామా: ముఖ్యమంత్రి అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

  • రాష్ట్రంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది
  • ఓటమి పాలైతే నాదే బాధ్యత
  • మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వహించాలని అధిష్ఠానం చెప్పింది

లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో కనుక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే అందుకు బాధ్యతగా తాను రాజీనామా చేస్తానంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కనుక పరాజయం పాలైతే అందుకు తాను పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందుకు బాధ్యత తీసుకోవాలన్నారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అందుకు పూర్తి బాధ్యత నాదే. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీ గెలుపు, ఓటములకు మంత్రులు, శాసనసభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధిష్ఠానం ఎప్పుడో చెప్పింది. నేనైతే ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయినా, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది’’ అని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. తుది విడతలో భాగంగా ఈ నెల 19న పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News