AADHAR: నది ఒడ్డున 3,000 ఆధార్ కార్డులు... స్వాధీనం చేసుకున్న అధికారులు

  • తమిళనాడులో ఘటన
  • ముళ్లియారు నదీ తీరంలో సంచుల నిండా ఆధార్ కార్డులు
  • కేసు నమోదుచేసుకున్న పోలీసులు

తమిళనాడులోని ఓ నదీ తీరంలో మూడు వేలకు పైగా ఆధార్ కార్డులు పడివున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి వద్ద ముళ్లియారు నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా వారికి పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు కనిపించాయి. ఈ విషయాన్ని ఆ చిన్నారులు తమ పెద్దలకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అక్కడ కొన్ని సంచుల నిండా ఆధార్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ముళ్లియారు నది వద్దకు చేరుకుని ఆ ఆధార్ కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ కార్డులన్నీ కట్టిమేడు, అతిరంగం, వడపట్టి గ్రామాల ప్రజలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News