Andhra Pradesh: చంద్రబాబు మాజీ అయిపోతాడని పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోంది: విజయసాయిరెడ్డి

  • వాగులు, నదులు కొల్లగొడుతున్నారు
  • గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలి
  • ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి

ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై ఏదో ఒక విమర్శ, ఆరోపణ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఓ ట్వీట్ చేశారు. ఏపీలో ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. మరో వారం రోజుల్లో చంద్రబాబు మాజీ సీఎం అయిపోతాడని అర్థంకావడంతో, పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు. పగలూరాత్రీ లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని, ఈ విషయమై గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలోని ప్రతి జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి మాఫియాను నియంత్రించాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

More Telugu News