vijayawada: గన్నవరం-విజయవాడ మధ్య భారీగా ట్రాఫిక్ జామ్!

  • కేసరపల్లి-రామవరప్పాడు మధ్య మరమ్మతులు
  • వన్ వే ద్వారా వెళుతున్న వాహనాలు
  • ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు  

కృష్ణా జిల్లా కేసరపల్లి- రామవరప్పాడు మధ్య జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలను వన్ వే ద్వారా పంపిస్తున్నారు. దీంతో, గన్నవరం- విజయవాడ మధ్యలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. జాతీయరహదారికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంటకు పైబడి ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనచోదకులు కొంత ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News