modi: అమిత్ షా సాధుపుంగవుడని బీజేపీ భావించడం దారుణం: టీడీపీ అధికార ప్రతినిధి యామిని

  • అమిత్ షా మంత్రిగా వున్న సమయంలో ఎన్నో అల్లర్లు జరిగాయి
  • రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ తీరు దారుణం
  • కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య స్ఫూర్తిని మోదీ దెబ్బతీశారు

  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మొన్న పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఈ అంశం గురించి ప్రస్తావిస్తూ బీజేపీ, అమిత్ షాపై నిప్పులు చెరిగారు.

 నాడు గుజరాత్ లో అమిత్ షా మంత్రిగా వున్న సమయంలో ఎన్నో అల్లర్లు జరిగాయని, అమిత్ షా సాధుపుంగవుడని బీజేపీ భావిస్తుండటం చాలా దారుణమని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపైనా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ అనుసరిస్తున్న తీరు, వారు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఉండే స్ఫూర్తిని మోదీ దెబ్బతీశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News