Telangana: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు సహా ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎక్సైజ్ అధికారులు

  • సినీ ప్రముఖుల ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయి
  • ఇప్పటి వరకు 7 ఛార్జిషీట్లు దాఖలు చేశాం
  • ఇంకా 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తాం

రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో సినీ ప్రముఖులు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 7 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, ఇంకా 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు.

More Telugu News