Tamilnadu: బీజేపీ వ్యాఖ్యలపై స్టాలిన్ మండిపాటు!

  • తమతో సంబంధాల కోసం డీఎంకే సంప్రదించిందన్న తమిళనాడు బీజేపీ చీఫ్ 
  • ఈ వ్యాఖ్యలను ఖండించిన స్టాలిన్
  • ఈ ఆరోపణలు నిజమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటా

 డీఎంకే తమ పార్టీతో సంబంధాల కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట కాకపుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఆమె చేసిన ఈ ఆరోపణలను రుజువు చేస్తే కనుక, రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ ఆరోపణలు తప్పని తేలితే ఆమెతో పాటు ప్రధాని మోదీ కూడా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.  

More Telugu News