Andhra Pradesh: ఏపీ మాజీ సీఎస్ పునేఠాకు పోస్టింగ్.. ఉత్తర్వులు జారీ

  • ఎన్నికల సమయంలో పునేఠాను పక్కనబెట్టిన సీఈసీ
  • ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోస్టింగ్
  • ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు  

ఏపీ మాజీ సీఎస్ పునేఠాకు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పునేఠాను నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏపీలో ఎన్నికలకు ముందు సీఎస్ గా ఉన్న పునేఠాను బాధ్యతల నుంచి సీఈసీ తప్పించింది. అప్పటి నుంచి తిరిగి పోస్టింగ్ కోసం పునేఠా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 31తో పునేఠా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో పునేఠాకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.
 

  • Loading...

More Telugu News