Anil: మొబైల్ అదృశ్యం విషయమై ఘర్షణ.. మహిళలు, చిన్నారి సహా 8 మందికి గాయాలు

  • మొబైల్ పోగొట్టుకున్న అనిల్
  • బుజ్జి అనే వ్యక్తిని నిలదీయడంతో ఘర్షణ
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

మొబైల్ ఫోన్ అదృశ్యంలో జరిగిన ఘర్షణలో 8 మంది గాయాల పాలైన ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లింగాలపాడుకు చెందిన వేల్పుల అనిల్‌కు చెందిన మొబైల్ అదృశ్యమైంది. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన బుజ్జి అనే వ్యక్తిని నిలదీయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.

విషయం తెలుసుకున్న ఇరు వర్గాల వారూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారి సహా 8 మంది, మార్కపూడి కుమార్, గోపీచంద్, గరికపాటి తిరుపతమ్మ, గరికపాటి కోటేశ్వరి, మార్కపూడి శ్రీకాంత్, వేల్పుల సుధ, మార్కపూడి నాగయ్య, గరికపాటి కృపారావు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కిశోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News