Andhra Pradesh: ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాపై పెదవి విరిచిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు!

  • మీడియా కథనాలు చూసి సినిమాకు వెళ్లా
  • కానీ నాకు అవెంజర్స్ అస్సలు నచ్చలేదు
  • దానికంటే మన ‘బాహుబలి’ బాగుంది

మీడియాలో వస్తున్న కథనాలు చూసి తాను ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’ సినిమాకు వెళ్లానని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. కానీ తనకు ఈ సినిమా నచ్చలేదనీ, నిరాశకు గురయ్యానని వ్యాఖ్యానించారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాతో పోల్చుకుంటే బాహుబలిని రాజమౌళి చాలా బాగా తీశారని ప్రశంసించారు.

బాహుబలి సినిమాతో రాజమౌళి సినిమా సాధించిన విజయంపై గర్వపడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. గత నెల 26న విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.16,364 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.

More Telugu News