పాక్ జాతిపిత జిన్నాను భారత ప్రధానిని చేసి ఉండాల్సింది: బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
- అప్పట్లో జిన్నాను ప్రధానిని చేసి ఉంటే దేశం రెండు ముక్కలయ్యేదే కాదు
- జిన్నా తెలివైనవాడు, విద్యావంతుడు
- దేశ విభజనకు నెహ్రూనే కారణం
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో నెహ్రూ కనుక పట్టుబట్టకపోయి ఉంటే దేశ విభజన జరిగి ఉండేదే కాదన్నారు. జిన్నా చాలా తెలివైన వాడని, విద్యావంతుడు, న్యాయవాది కూడా అని గుమన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకుని జిన్నాను ప్రధాని చేసి ఉంటే దేశం రెండు ముక్కలయ్యేదే కాదని, ఇప్పుడీ పరిస్థితి ఉండేదే కాదని పేర్కొన్నారు.
జిన్నాను ప్రశంసించిన శతృఘ్న సిన్హా వ్యాఖ్యలపై విరుచుకుపడిన బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్, పాకిస్థాన్ ఒకటేనని ధ్వజమెత్తింది. ఇప్పుడు ఏకంగా బీజేపీ నేతే జిన్నాను పొగడడంతో కాంగ్రెస్ నేతలకు మంచి ఆయుధం దొరికినట్టు అయింది.