London: సుష్మా స్వరాజ్ సాయం కోరుతూ తెలంగాణ హోంమంత్రి లేఖ

  • లండన్‌లో దారుణ హత్యకు గురైన నజీముద్దీన్
  • ఉపాధి కోసం లండన్‌ వెళ్లిన యువకుడు
  • కుటుంబ సభ్యులకు వీసా ఇప్పించాలని లేఖ

ఉపాధి కోసం లండన్ వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన నజీముద్దీన్ అనే యువకుడు అక్కడ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ నేడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సాయం కోరుతూ ఆమెకు లేఖ రాశారు. నజీముద్దీన్ కుటుంబ సభ్యులు లండన్‌కు వెళ్లేందుకు వీలుగా వీసా ఇప్పించాలని మహమూద్ అలీ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

More Telugu News