కత్తులు, కర్రలతో బాసర రైల్వేస్టేషన్లో దుండగుల హల్ చల్...భయాందోళనలకు గురైన ప్రయాణికులు
- సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి
- నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ
- దొంగలా, గ్యాంగ్ వార్ సభ్యులా అని ఆరా
పది మంది వరకు సభ్యులున్న ఈ ముఠా హఠాత్తుగా రైల్వే స్టేషన్లోకి ప్రవేశించింది. వారి చేతిలోని ఆయుధాలు చూసే సరికి ప్రయాణికుల పైప్రాణాలు పైనే పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్టేషన్కి వచ్చి ముఠాలోని కొందరు సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరు దొంగలా? లేక గ్యాంగ్ల మధ్య గొడవ కారణంగా ఇలా ఆయుధాలతో తిరుగుతున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు.