Uttar Pradesh: ముగిసిన ఆరో దశ ఎన్నికల ప్రచారం.. 12న ఎన్నికలు

  • ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు 12న పోలింగ్
  • పోలింగ్ కేంద్రాల వద్ద  కట్టుదిట్టమైన భద్రత
  • మే 19న చివరి దశ ఎన్నికలు

ఏడు రాష్ట్రాల్లో ఆరో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఢిల్లీలోని 7, హరియానాలోని 10, జార్ఖండ్ లోని 4, మధ్యప్రదేశ్ లోని 8, ఉత్తరప్రదేశ్ లోని 14, బీహార్ లోని 8, పశ్చిమ బెంగాల్ లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆరో దశ ఎన్నికలు జరగనున్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, చివరి దశ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి.  

More Telugu News