Karimnagar: అపార్ట్‌మెంట్ గోడ కూలడంతో ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

  • కడుతుండగా కూలిన అపార్ట్‌మెంట్ గోడ
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అపార్ట్‌మెంట్ గోడ ఒక్కసారిగా కూలడంతో ఒకరు మృతి చెందగా, నలుగురి కాళ్లు విరిగాయి. కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ గోడ కడుతుండగా ఒక్కసారిగా ఏడుగురు కూలీలపై అది కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి కాళ్లు విరిగిపోయాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

More Telugu News