Hyderabad: మణికొండలో ఆడుకుంటూ.. కాలువలో పడి ఐదేళ్ల బాలుడి మృతి

  • తోటి పిల్లలతో ఆడుకుంటూ పడిపోయిన బాలుడు
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
  • మృతదేహం వెలికితీత

హైదరాబాద్‌ శివారు మణికొండలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ సమీపంలోని కాలువలో పడిపోవడంతో మృత్యువుపాలయ్యాడు. స్థానికంగా తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గండిపేట నుంచి షేక్‌పేట వాటర్‌ ఫిల్టర్‌కు నీరందించే కాలువ మణికొండ ప్రాంతం మీదుగా వెళ్తుంది.

ఈ కాలువ పక్కన స్థానిక నివాసితుల పిల్లలు ఆడుకుంటున్నారు. వీరిలో ఆనంద్‌ అనే పిల్లాడు ఆట సరదాలో పడి అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  వారు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో కాలువలో గల్లంతైన బాలుడి కోసం వెతికారు. కాసేపటికి బాలుడి మృతదేహం లభించడంతో తల్లిదండ్రులు గొల్లుమన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News