janasena: ఈ నెల 11న నంద్యాల వెళ్లనున్న ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • ఇటీవల మృతి చెందిన జనసేన నేత ఎస్పీవై రెడ్డి
  • ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్  
  • ఓ ప్రకటనలో తెలిసిన ‘జనసేన’
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల కిందట ఎస్పీవై రెడ్డి మృతి చెందారు. ఈ సందర్భంగా దివంగత నేతకు నివాళులర్పించి, ఆయన కుటుంబాన్నిజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ నెల 11న నంద్యాలకు పవన్ కల్యాణ్ వెళతారని ‘జనసేన’ ఓ ప్రకటనలో తెలిపింది.  
janasena
Pawan Kalyan
spy reddy
nandyala

More Telugu News