sensex: రిలయన్స్ కు అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు కూడా నష్టాలే

  • వరుసగా ఏడో రోజు నష్టపోయిన మార్కెట్లు
  • 230 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 57 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో, ఈరోజు కూడా నష్టాలు తప్పలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 37,558కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 11,301కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.94%), బజాజ్ ఫైనాన్స్ (1.64%), హీరో మోటో కార్ప్ (1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.87%), టీసీఎస్ (0.75%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.41%), కోల్ ఇండియా (-2.53%), ఎన్టీపీసీ (-2.33%), ఏసియన్ పెయింట్స్ (-2.29%), భారతి ఎయిర్ టెల్ (-1.64%).

More Telugu News