prayagraj: పాకిస్థానీలకు ప్రవేశం లేదు: ప్రయాగ్ రాజ్ లో ఓ హోటల్ ముందు బోర్దు

  • పుల్వామా ఘటన తర్వాత ఈ బోర్డును పెట్టామన్న మేనేజర్
  • మా హోటల్ కు పాకిస్థానీలు ఎవరూ రాలేదు
  • వచ్చినా వారికి రూములు ఇవ్వము

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇదే సమయంలో పాకిస్థాన్ పై భారత ప్రజల్లో కూడా వ్యతిరేకత మరింత ఎక్కువైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) నగరంలోని ఓ హోటల్... పాకిస్థానీలకు మా హోటల్ లోకి అనుమతి లేదంటూ ఏకంగా బోర్డునే ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హోటల్ మేనేజర్ మాట్లాడుతూ, పుల్వామా ఘటన తర్వాత తాము ఈ బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు. పాకిస్థానీలు ఎవరూ తమ హోటల్ కు రాలేదని... ఒకవేళ వచ్చినా వారికి రూములను ఇవ్వబోమని స్పష్టం చేశారు. పాక్ పై ఈ రకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.

More Telugu News