కంచుకోటలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- ఛత్తీస్ గఢ్ లోని సుక్మా-దంతేవాడ ప్రాంతంలో ఘటన
- నిఘావర్గాల సమాచారంతో కూంబింగ్ నిర్వహణ
- భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో బలగాల కదలికలను పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టు చెందినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
ఎన్ కౌంటర్ జరిగిన చోటు నుంచి ఇన్సాఫ్ తుపాకి, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తప్పించుకున్న మావోల కోసం గాలింపును ముమ్మరం చేశామని పేర్కొన్నారు.