Andhra Pradesh: ఏపీ సీఈఓ, సీఎస్ పై ఫిర్యాదు చేసిన టీడీపీ నేత దేవీబాబు

  • వైసీపీకి ద్వివేది అనుకూలంగా వ్యవహరించారు
  • కడప జిల్లాలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ప్రదర్శించారు
  • ఈసీ నిషేధాజ్ఞలను ధిక్కరించారు..వర్మపైనా ఫిర్యాదు

ఏపీ సీఈఓ ద్వివేది, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేత దేవీబాబు చౌదరి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైసీపీకి ద్వివేది అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. వీళ్లిద్దరితో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపైనా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News